రంజాన్ వేళ చిన్ననాటి స్నేహితుడ్ని కలిసిన కేసీఆర్

నేడు ఘనంగా ఈద్ ఉల్ ఫితర్
కేసీఆర్ ను కలిసిన మహ్మద్ జహంగీర్, మహ్మద్ జుబేర్ తదితరులు
వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్ 
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు రంజాన్ సందర్భంగా చిన్ననాటి స్నేహితుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మహమ్మద్ జహంగీర్ ను, ఆయన కుటుంబ సభ్యులను కలిశారు. ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో ఈ భేటీ జరిగింది. కేసీఆర్‌తో వారు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు కేసీఆర్‌కు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ ను కలిసిన వారిలో బీఆర్ఎస్ రాష్ట్రనేత జుబేర్ మహమ్మద్ కూడా ఉన్నారు.

కేసీఆర్ కూడా వారికి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ భేటీలో వారు కేసీఆర్‌కు సంప్రదాయ ఇస్లాం టోపీని బహూకరించగా, ఆయన దానిని ధరించారు. కాసేపు వారితో కలిసి పండుగ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సమావేశం పూర్తిగా వ్యక్తిగతంగా, పండుగ వాతావరణంలో స్నేహపూర్వకంగా సాగింది.

KCR
K Chandrasekhar Rao
Telangana
BRS
Ramzan
Mohammed Jahangir
Errvalli
Zuber Mohammed
Telangana Politics
Ramadan

More Telugu News